తిరుమలలో నేడు పౌర్ణమి గరుడ సేవ
ABN, First Publish Date - 2021-02-27T14:03:30+05:30
తిరుమల: తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరుమాడ వీధుల్లో..
తిరుమల: తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరుమాడ వీధుల్లో.. గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగానే ఉంది. నిన్న శ్రీవారిని 51,368 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,519 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
Updated Date - 2021-02-27T14:03:30+05:30 IST