మీటర్లు బిగిస్తే అడ్డుకుంటాం: శైలజానాథ్
ABN, First Publish Date - 2021-01-18T08:01:28+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి తిలోదకాలిస్తూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.
గుంటూరు, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి తిలోదకాలిస్తూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. గుంటూరు రాజీవ్గాంధీ భవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ, ఇక్కడ సీఎం జగన్... ఇద్దరూ రైతుద్రోహులేనని మండిపడ్డారు. 3సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 19న గవర్నర్ను కలుస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-01-18T08:01:28+05:30 IST