కూలీలపై దుండగుల దాడి
ABN, First Publish Date - 2021-12-02T21:31:22+05:30
జిల్లాలోని మద్దికెరలో రైల్వే బ్రిడ్జి పనులు చేస్తున్నకాంట్రాక్ట్
కర్నూలు: జిల్లాలోని మద్దికెరలో రైల్వే బ్రిడ్జి పనులు చేస్తున్నకాంట్రాక్ట్ మేనేజర్, కూలీలపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. తమ పర్మిషన్ లేకుండా పనులు ఎలా చేస్తారంటూ సిబ్బందిని బెదిరించారు. కంకర మిక్సర్, బొలేరో వాహనాలను దుండగులు ఎత్తుకెళ్లారు. కమీషన్ ఇవ్వలేదనే కారణంతోనే వైసీపీ నేతలే దాడి చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
Updated Date - 2021-12-02T21:31:22+05:30 IST