AP: తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ
ABN, First Publish Date - 2021-07-18T14:31:45+05:30
నగరిలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మందికి
తిరుపతి: నగరిలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వడమాలపేటలో వద్ద చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై నుంచి తిరుమలకు భక్తులు కాలినడకన వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-07-18T14:31:45+05:30 IST