తిరుమల ఘాట్రోడ్లను పరిశీలించిన ఐఐటీ నిపుణుల బృందం
ABN, First Publish Date - 2021-11-25T00:54:33+05:30
ఇటీవలి భారీ వర్షాలకు తిరుమల ఘాట్రోడ్డులో విరిగిపడిన కొండచరియలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది.
తిరుమల: ఇటీవలి భారీ వర్షాలకు తిరుమల ఘాట్రోడ్డులో విరిగిపడిన కొండచరియలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలను, రెండు ఘాట్రోడ్లలోని కొండచరియలను ఐఐటీ నిపుణులకు టీటీడీ అధికారులు చూపించారు. కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలకు సంబంధించి ఐఐటీ నిపుణులు త్వరలో సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందించనున్నారు. టీటీడీ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ నిపుణులు ప్రొఫెసర్ నరసింహారావు, సీవీ ప్రసాద్, టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-25T00:54:33+05:30 IST