తిరుపతి రూరల్ మండలంలో చోరీ
ABN, First Publish Date - 2021-09-05T03:21:53+05:30
తిరుపతి రూరల్ మండలంలోని కాలూరు క్రాస్ దగ్గర
తిరుపతి: తిరుపతి రూరల్ మండలంలోని కాలూరు క్రాస్ దగ్గర దొంగతనం జరిగింది. కాలూరు క్రాస్ దగ్గర ఎంజీ బ్రదర్స్ లేఅవుట్లోని కోర్టు స్టెనో సుబ్రమణ్యం ఇంట్లో చోరీ జరిగింది. 60 గ్రాముల బంగారాన్ని దొంగలు అపహరించారు. ముత్యాలరెడ్డిపల్లి పీఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-05T03:21:53+05:30 IST