పిడుగురాళ్ళలో ట్రాక్టర్ బోల్తా
ABN, First Publish Date - 2021-03-19T17:18:15+05:30
కూలీలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన
గుంటూరు: జిల్లాలో జరిగిన వేర్వేరు రెండు ప్రమాదాల్లో పలువురు కూలీలు గాయపడ్డారు. పిడుగురాళ్ళ, పత్తిపాడు మండలాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. కూలీలను తీసుకెళుతున్న రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి.
పిడుగురాళ్ళ మండలంలో కూలీలను తీసుకెళుతున్న ట్రాక్టర్ మండలంలోని గుత్తికొండ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. గుళ్ళపల్లి నుంచి గుత్తికొండలోని పొలం పనులకు కూలీలను తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. .
పత్తిపాడు మండలంలో
మరో ఘటనలో ముగ్గురికి గాయలయ్యాయి. పత్తిపాడు మండలంలోని గొట్టిపాడు వద్ద కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ముగ్గురి కూలీలకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. మంచు కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.
Updated Date - 2021-03-19T17:18:15+05:30 IST