ఎక్సైజ్ అధికారిని కాటు వేసిన పాము
ABN, First Publish Date - 2021-09-08T03:06:01+05:30
ప్రభుత్వ మద్యం షాపులో తనిఖీ నిర్వహిస్తుండగా అధికారిని పాము
గుంటూరు: ప్రభుత్వ మద్యం షాపులో తనిఖీలు నిర్వహిస్తుండగా అధికారిని పాము కాటు వేసింది. దాచేపల్లి మాదినపాడు రోడ్డులోని ప్రభుత్వం మద్యం షాపులో తనిఖీల నిమిత్తం ఎక్సైజ్ అధికారిణి స్వర్ణలత వచ్చారు. మద్యం షాపులో తనిఖీ నిర్వహిస్తుండగా మద్యం బాక్సులో నుంచి బయటకు వచ్చి స్వర్ణలతను పాము కాటు వేసింది. దాచేపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో స్వర్ణలతకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం స్వర్ణలతను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు సిబ్బంది తరలించారు.
Updated Date - 2021-09-08T03:06:01+05:30 IST