ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకే రక్షణ కొరవడింది!

ABN, First Publish Date - 2021-01-20T08:41:25+05:30

రాష్ట్రంలో పోలీసు లే పోలీసులను రక్షించుకోలేని దుస్థితి నెలకొందని బీజేపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. ‘రెండు రో జుల్లో నువ్వు ఉండవ్‌..’ అంటూ ఒక జిల్లా ఎస్పీని బహిరంగంగా బెదిరించే స్థాయికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డిపై కేసు పెట్టాలి

బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి 


అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు లే పోలీసులను రక్షించుకోలేని దుస్థితి నెలకొందని బీజేపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. ‘రెండు రో జుల్లో నువ్వు ఉండవ్‌..’ అంటూ ఒక జిల్లా ఎస్పీని బహిరంగంగా బెదిరించే స్థాయికి వైసీపీ ఎమ్మెల్యే తెగించారంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం అవుతోందన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మంగళవారం విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసుల్ని మూలన కూర్చోబెట్టి ఐపీసీ కాకుండా వైసీపీ చట్టాన్ని అమలు చేసే వారికి ఖాకీ యూ నిఫాం వేసి అధికార పార్టీ.. సేవ చేయించుకుంటోందని వి మర్శించారు. ఇలాంటి పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా.. వైసీపీ కార్యకర్తలు పోలీసుల్లా పెత్తనం చెల్లాయిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఒక ఎమ్మెల్యే గూండా లాగా జిల్లా ఎస్పీని బెదిరించి దుర్భాషలాడటం అరాచకానికి పరాకాష్ట. ఏపీలో ఐపీసీ ఏమైనా వైసీపీగా మారిపోయిందా? లేక వైసీపీ ఎమ్మెల్యేకి ఐపీసీ వర్తించదా? వ్యవస్థలన్నీ వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయాయి’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-01-20T08:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising