26న ఈశాన్య రుతుపవనాలు రాక
ABN, First Publish Date - 2021-10-21T11:04:51+05:30
నైరుతీ రుతుపవనాల నిష్క్రమణ చివరి దశకు వచ్చింది.
అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): నైరుతీ రుతుపవనాల నిష్క్రమణ చివరి దశకు వచ్చింది. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నాయి. ఈ నెల 26కల్లా దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. అదేరోజు దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వర్షాలు పెరగనున్నాయని వెల్లడించింది. కాగా బుధవారం రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల మాత్రం ఎండ తీవ్రత కొనసాగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - 2021-10-21T11:04:51+05:30 IST