వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం
ABN, First Publish Date - 2021-12-13T21:54:45+05:30
వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణ ఘటనచోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువుమృతి చెందినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి: వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణ ఘటనచోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువుమృతి చెందినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాదర్గుల్ చేద్దిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఈ రోజు ఉదయం పాపా ఏడుస్తుంది అని డాక్టర్లకు చెప్పగా, కొద్దిసేపటి తరవాత డాక్టర్లు వచ్చి పాపా చనిపోయింది అని చెప్పారని వాపోతున్నారు. కనీసం ముందు చెప్పిన మరో హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళం అన్నారు. కనీసం డాక్టర్లు సమాచారం కూడా ఇవ్వలేదదని ఆరోపిస్తున్నారు.డాక్టర్ నిర్లక్ష్యంగానే పాపా మృతి చేదింది అని బంధువులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2021-12-13T21:54:45+05:30 IST