అంధకారంలో తహసీల్దార్ కార్యాలయం
ABN, First Publish Date - 2021-03-03T00:12:07+05:30
కరెంట్ బిల్లులు కట్టకపోతే సామాన్యులైనా, ప్రభుత్వ ఆఫీసులైనా
నెల్లూరు: కరెంట్ బిల్లులు కట్టకపోతే సామాన్యులైనా, ప్రభుత్వ ఆఫీసులైనా తమకు సమానమేనని విద్యుత్ శాఖ సిబ్బంది నిరూపించారు. విద్యుత్ బకాయిలు భారీగా పెండింగ్లో ఉండడంతో చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సిబ్బంది విద్యుత్ను నిలిపి వేశారు. వాడుకున్న కరెంట్కు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం అధికారులు బిల్లులు చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా బిల్లులు చెల్లించకపోవడంతో చివరికి తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సిబ్బంది పవర్ కట్ చేశారు. విద్యుత్ సదుపాయం లేక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.
Updated Date - 2021-03-03T00:12:07+05:30 IST