ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ లాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-01-27T21:02:25+05:30

పిరికితనం అనేది తెలియని పార్టీ టీడీపీ అని, భయం అనేది మన ఇంటావంటా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులతో అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పిరికితనం అనేది తెలియని పార్టీ టీడీపీ అని, భయం అనేది మన ఇంటావంటా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులతో అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలను ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. వైసీపీ లాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదని తెలిపారు. నాలుగు దశాబ్దాల చరిత్ర.. 22 ఏళ్లు అధికారంలో టీడీపీ ఉందని గుర్తుచేశారు. జగన్ సీఎం అయ్యాక అధికార యంత్రాంగం నీరు గారిపోయిందని, రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా తెగించారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారుల్లో కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారని ఆరోపించారు. గ్రామాల్లో యధేచ్చగా దోపిడి చేసేందుకే ఏకగ్రీవాల జపం వైసీపీ చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిపేయాలని, ప్రభుత్వ మద్యం దుకాణాలను, లిక్కర్ షాపులను మూసివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-27T21:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising