టీడీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన వైసీపీ నేతలు
ABN, First Publish Date - 2021-04-08T13:41:38+05:30
టీడీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన వైసీపీ నేతలు
గుంటూరు: జిల్లాలోని ఈపూరు మండలం గోపువారిపాలెంలో వైసీపీ దౌర్జన్యంకు పాల్పడింది. టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి రానివ్వలేదు. ఏజెంట్ ఫారాలు చించేసి వైసీపీ నేతలు టీడీపీ నేతలను బయటకు నెట్టేశారు. పోలీసులు వైసీపీకి సహకరిస్తున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో అక్కడ పరిస్థితి చక్కబడింది.
Updated Date - 2021-04-08T13:41:38+05:30 IST