రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు: చంద్రబాబు
ABN, First Publish Date - 2021-08-22T13:03:15+05:30
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతమైన
అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతమైన పండగ రక్షాబంధన్ అని, అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆప్యాయతలు నింపుతోందన్నారు. మావీయ సంబంధాలను రాఖీ పండుగ మరింత పటిష్టం చేస్తుందన్నారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సోదర, సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
Updated Date - 2021-08-22T13:03:15+05:30 IST