ఫ్యాన్ గుర్తుపై జేసీ పవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-07-16T18:33:21+05:30
జేసీ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలకు అండగా ఉంటామని టీడీపీ పార్లమెంట్ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో
అనంతపురం: జేసీ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలకు అండగా ఉంటామని టీడీపీ పార్లమెంట్ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజల మధ్యే ఉంటున్నాడన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రారని.. అందుకోసమే ఈ నెల 19న సీఎం జగన్ ఇంటి తలుపు కొట్టి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చినా కేసులు పెడతామంటూ జగన్ సర్కార్ బెదిరిస్తోందని, దేనికి పనికి రాని ఓ వ్యక్తి చేతిలో తన తమ్ముడు ఓటమి చెందాడనే బాధ ఉందన్నారు. ఇక వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్... గాలి ఇవ్వడం సంగతి అటుంచితే యువతీ యువకులు దానికి ఉరేసుకుని ప్రాణాలు కోల్పోతున్నరని పవన్ రెడ్డి ఆరోపించారు.
Updated Date - 2021-07-16T18:33:21+05:30 IST