ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా..: టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-09-17T20:37:09+05:30

జోగి రమేష్‌కు మంత్రి పదవి కావాలంటే సీఎం జగన్‌ను మంచి కార్యక్రమాలతో ఆకట్టుకోవాలని పోతుల బాలకోటయ్య సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎమ్మెల్యే జోగి రమేష్‌కు మంత్రి పదవి కావాలంటే సీఎం జగన్‌ను మంచి కార్యక్రమాలతో ఆకట్టుకోవాలని అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య సూచించారు. శుక్రవారం చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. మనమేమన్న హిట్లర్, తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు  డీజీపీ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే సీఎం జగన్, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే.. ఇంట్లో ఉన్న తమపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని బాలకోటయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను అయితే కిందపడేసి కొట్టారన్నారు. చంద్రబాబు ఇంటిపై ఆకు రౌడీ పదిమందితో దాడి చేయడానికి వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-17T20:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising