వడ్డీతో సహా తీర్చుకుంటాం: తిక్కారెడ్డి
ABN, First Publish Date - 2021-12-12T02:17:30+05:30
తనపై జరిగిన దాడి విషయంలో ప్రతి రక్తపు బొట్టుకు వడ్డీతో
కర్నూలు: తనపై జరిగిన దాడి విషయంలో ప్రతి రక్తపు బొట్టుకు వడ్డీతో సహా తీర్చుకుంటామని టీడీపీ నేత తిక్కారెడ్డి స్పష్టం చేశారు. బాలనాగిరెడ్డి సహకారంతో వైసీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయని ఆయన తెలిపారు.
జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. వైసీపీ శ్రేణులను తిక్కారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-12-12T02:17:30+05:30 IST