తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు: పట్టాభి
ABN, First Publish Date - 2021-06-24T01:09:12+05:30
వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి
అమరావతి: వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఇది ఫేక్ ప్రభుత్వం, జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని పట్టాభి దుయ్యబట్టారు. జూన్ 1 నుంచి 22 వరకు 58 లక్షల 74 వేల 201 డోసులు ఇచ్చామని ప్రభుత్వ తెలిపిందన్నారు. వాస్తవానికి ఇచ్చింది 39 లక్షల 89 వేలు మాత్రమేనని పట్టాభి పేర్కొన్నారు. తామే నెంబర్వన్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టాభి విమర్శించారు. ఫేక్ సీఎంను అంకెలతో సహా రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని పట్టాభి తెలిపారు.
Updated Date - 2021-06-24T01:09:12+05:30 IST