గత అనుభవాలను వైసీపీ నేతలు మర్చిపోయారా?: పిల్లి మాణిక్యరావు
ABN, First Publish Date - 2021-06-19T00:15:39+05:30
గత అనుభవాలను మర్చిపోయి లోకేశ్పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత పిల్లి
అమరావతి: గత అనుభవాలను మర్చిపోయి లోకేశ్పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మంది టీడీపీ కార్యకర్తలను చంపినవారిని లోకేశ్ హెచ్చరించడం తప్పా అని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. సీఎం పదవి కోసం తండ్రి శవంతో జగన్ రాజకీయం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపించి, ఆ నేరాన్ని చంద్రబాబుపైకి నెట్టి, ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేసింది జగన్ కాదా అని మాణిక్యరావు మండిపడ్డారు.
Updated Date - 2021-06-19T00:15:39+05:30 IST