ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులు బలైపోతున్నారు: లోకేష్‌

ABN, First Publish Date - 2021-09-05T01:35:48+05:30

వైసీపీ నేతల ధన దాహానికి చిన్నారులు బలైపోతున్నారని టీడీపీ నాయకుడ లోకేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి‌: వైసీపీ నేతల ధన దాహానికి చిన్నారులు బలైపోతున్నారని టీడీపీ నాయకుడ లోకేష్‌ ఆరోపించారు. నాడు-నేడు పేరుతో లెక్కాజమ లేకుండా వందల కోట్లు తినేస్తూ పిల్లల్ని ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. నాడు బడి - నేడు పాడుబడిందన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విద్యార్థి విష్ణు మృతి చెందాడన్నారు.  కర్నూలు జిల్లాలో స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.


డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి నియోజకవర్గంలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. శిథిలమైన భవనం, ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని లోకేష్‌ అన్నారు. తమకు పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు, గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వైసీపీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్, సొంత పత్రికలో డబ్బా యాడ్స్ మాని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని లోకేష్‌   హితవు పలికారు. 

Updated Date - 2021-09-05T01:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising