కేసులకు భయపడే ప్రసక్తే లేదు: అయ్యన్నపాత్రుడు
ABN, First Publish Date - 2021-09-19T00:50:50+05:30
తనపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని
విశాఖ: తనపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తుగ్లక్ సీఎం నిర్ణయాల వల్ల ఏపీ అధోగతి పాలవుతోందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై జగన్ పన్నుల భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఏపీ భవిష్యత్తు పాడవుతుందన్నారు. జగన్రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలయిందని అయ్యన్న అన్నారు.
Updated Date - 2021-09-19T00:50:50+05:30 IST