ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం: Chandrababu

ABN, First Publish Date - 2021-11-25T16:00:05+05:30

సీఎం జగన్‌రెడ్డి అహంకారం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి అహంకారం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని... ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సమంయలోనే ప్రభుత్వ సమర్థత ఏమిటో తెలుస్తుందన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా దొరకలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహించారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని.. సమర్థతతో పనిచేయాలని హితవుపలికారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2021-11-25T16:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising