నరేగా బిల్లులు పెండింగ్ వల్ల...: మాజీ మంత్రి
ABN, First Publish Date - 2021-09-30T21:40:33+05:30
నరేగా బిల్లులు పెండింగ్ వల్ల అప్పులు పాలు అయ్యి 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి అమరానాధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: నరేగా బిల్లులు పెండింగ్ వల్ల అప్పులు పాలు అయ్యి 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి అమరానాధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలోనే గ్రామాలు అభివృద్ది చేసిన వారికి బిల్లులు చెల్లింపులు జరపక పోతే రాష్ట్రంలో గ్రామాలను ఏమి అభివృద్ది చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిబంధనలు మేరకు చెల్లింపులు జరపాలని సూచించారు. లేదంటే కోర్టు దిక్కారణ చర్యలకు బాధ్యులు కావల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-09-30T21:40:33+05:30 IST