శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
ABN, First Publish Date - 2021-04-08T01:40:33+05:30
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తూ
తిరుమల: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 11వ తేదీ సాయంత్రం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే జారీ చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
Updated Date - 2021-04-08T01:40:33+05:30 IST