కొవిడ్ బాధిత ఉద్యోగులను ఆదుకోండి: బొప్పరాజు
ABN, First Publish Date - 2021-05-14T08:52:00+05:30
కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కుటుంబ సభ్యులను సైతం పోగొట్టుకుంటున్న ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని,
అమరావతి/విజయవాడ(పాయకాపురం), మే 13: కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కుటుంబ సభ్యులను సైతం పోగొట్టుకుంటున్న ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, వారిని ఆదుకోవాలని అమరావతి జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవి.రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక వైపు కొవిడ్ విధులు, మరోవైపు వారి శాఖాపరమైన పనులతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2021-05-14T08:52:00+05:30 IST