తాలిబన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా: పట్టాభి
ABN, First Publish Date - 2021-10-06T20:45:05+05:30
తాలిబన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాజమండ్రి: తాలిబన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్తో ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి సంబంధం ఉండడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. దీనిపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం సరికాదన్నారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయి, డ్రగ్స్కు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు. ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని పట్టాభి తెలిపారు.
Updated Date - 2021-10-06T20:45:05+05:30 IST