అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-07-10T01:52:42+05:30
జిల్లాలో అప్పుల బాధలు భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం
అనంతపురం: జిల్లాలో అప్పుల బాధలు భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం మండలంలోని పోతుకుంట పంచాయతీ బృందావన్ కాలనీకి చెందిన కె.చంద్రశేఖర్ అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య దేవి, ఇద్దరు కూతుర్లు లావణ్య, చందన ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-07-10T01:52:42+05:30 IST