ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరి ప్రాణం తీసిన కరోనా, ఆర్థిక ఇబ్బందులు

ABN, First Publish Date - 2021-04-11T09:06:34+05:30

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుమార్తెతో కలిసి శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో జరిగింది. జాగా రవి(40)కి భార్య భరణి, సహస్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమార్తెతో సహా టెకీ ఆత్మహత్య


విజయవాడ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుమార్తెతో కలిసి శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో జరిగింది. జాగా రవి(40)కి భార్య భరణి, సహస్ర (10) ఉన్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ పనిచేసిన రవికి కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. కుటుంబంతో విజయవాడ వచ్చేశాడు. భార్య భరణికి డయాలసిస్‌ అవసరం కావడంతో గవర్నరుపేటలో తల్లి వద్ద ఉంటోంది. రవి తన కుమార్తెతో కలిసి ఉంటున్నాడు.


శనివారం ఉదయం ఆయన బావమరిది రవికి ఫోన్‌ చేయగా.. జవాబు లేకపోవడంతో తన కుమారుడ్ని ఇంటికి పంపించాడు. ఇంట్లో తండ్రీ కూతుళ్లు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. ఎంతో జీవితం ఉన్న సహస్రకు ఉరివేసినందుకు క్షమాపణ చెప్తూ, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని, తన మూత్రపిండాలను భార్య భరణికి దానం చేయాలని లేఖలు రాసి, వాటిని గదిలో గోడలకు అతికించి చనిపోయాడు.

Updated Date - 2021-04-11T09:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising