ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావు అదృశ్యం.. భార్య ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2021-12-19T18:30:44+05:30

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వైసీపీ నేత సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వైసీపీ నేత సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. సుబ్బారావు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. రాత్రి వైసీపీ కార్యకర్తలు సుబ్బారావు ఇంటిపైదాడికి సైతం పాల్పడ్డారు. ఆ సమయంలో సుబ్బారావు ఇంట్లో లేకపోవటంతో బైకు తదితర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం సుబ్బారావు కుటుంబ సభ్యులను దుర్బాషలడుతు వారిని భయబ్రాంతులకు గురిచేశారు.


కొడాలి నానిని విమర్శించే స్థాయి మీకెక్కిడిదంటూ దుర్బాషలాడారు. ప్రస్తుతం సుబ్బారావు ఆచూకీ లభ్యం కావటం లేదు. కుటుంబ సభ్యులు సుబ్బారావుకు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తమ కుటుంబానికి సుబ్బారావు ఒక్కరే ఆధారమని ఆయన భార్య గుప్తా నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు ఏమైందోనని ఆందోళన చెందుతోంది. తన భర్త ఆచూకీ కోసం ఎదురు చూస్తోంది.


కాగా.. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు’’ అని సుబ్బారావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-19T18:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising