ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై ధ్వజమెత్తిన..వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABN, First Publish Date - 2021-06-21T18:16:49+05:30

రైతు సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. నగరంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. కరోనా సెకండ్‎వేవ్‎తో ప్రజలు అల్లాడుతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైతు సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. నగరంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. కరోనా సెకండ్‎వేవ్‎తో ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకువచ్చి రైతుల ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తోందని ఆరోపించారు. తప్పుడు విధానాలతో 124 సెక్షన్లను పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 26న గవర్నర్‌ను కలిసి వ్యవసాయ చట్టాల రద్దు, రైతు ఉపశమన చట్టం చేయాలని వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. లేదంటే..కార్మిక, రైతు సంఘాలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తామని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T18:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising