శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం
ABN, First Publish Date - 2021-11-22T04:22:30+05:30
శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేగింది. రోడ్డుపై 108 సిబ్బందికి...
కర్నూలు: శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేగింది. రోడ్డుపై 108 సిబ్బందికి పెద్దపులి కనిపించింది. దీంతో దేవస్థానం ఈవో అప్రమత్తమయ్యారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం ఈవో విజ్ఞప్తి చేశారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరారు.
Updated Date - 2021-11-22T04:22:30+05:30 IST