జ్ఞానానంద ఆశ్రమాన్ని సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి
ABN, First Publish Date - 2021-12-18T22:33:09+05:30
జ్ఞానానంద ఆశ్రమాన్ని శనివారం ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సందర్శించారు. హైందవ సంఘాల ప్రతినిధులు, గోవుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: జ్ఞానానంద ఆశ్రమాన్ని శనివారం ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సందర్శించారు. హైందవ సంఘాల ప్రతినిధులు, గోవుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోవులకు అందుతున్న దాణా, వైద్య సేవలపై శ్రీనివాసానంద సరస్వతి ఆరా తీశారు. ఇప్పటివరకు 20 గోవులు మృతి చెందాయని.. ఈ రోజు మొత్తం ఎనిమిది గోవులు మృతిచెందినట్లు తెలిపారు. ఈసందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ... ఆలయాల ఆస్తులను, ఆదాయాన్ని తీసుకున్నప్పుడు, గోవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గోవుల మృతి మంచిది కాదన్నారు. గోవులు మృతిచెందుతున్న వైసీపీ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. నిధులు స్వరూపానంద స్వామికి, గోవుల సంరక్షణ చిన్న ఆశ్రమాలకా అని ప్రశ్నించారు. శారదా పీఠం, సింహాచలం దేవస్థానం గోవులను సంరక్షించాలని సూచించారు. అక్రమ రవాణాలో పట్టుబడ్డ గోవుల సంరక్షణ కోసం, ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేయాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు.
Updated Date - 2021-12-18T22:33:09+05:30 IST