ఉసురుతీసిన ఈత సరదా
ABN, First Publish Date - 2021-06-16T05:16:40+05:30
ఈత సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. ఈ విషాద ఘటన మఖరాంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొగిడియాపుట్టుగకు చెందిన బొగియా మోహనరావు(29) మంగళవారం మఖరాంపురం పాఠశాల ఆవరణలోని క్రీడామైదానంలో తోటి స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఇంటికి తిరుగుముఖం పడుతున్న సమయంలో సమీపంలోని లింగాల చెరువులో స్నేహితులు రాంబాబు,
చెరువులో స్నానానికి దిగి యువకుడి మృతి
మఖరాంపురంలో ఘటన
కంచిలి: ఈత సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. ఈ విషాద ఘటన మఖరాంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొగిడియాపుట్టుగకు చెందిన బొగియా మోహనరావు(29) మంగళవారం మఖరాంపురం పాఠశాల ఆవరణలోని క్రీడామైదానంలో తోటి స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఇంటికి తిరుగుముఖం పడుతున్న సమయంలో సమీపంలోని లింగాల చెరువులో స్నేహితులు రాంబాబు, హరికృష్ణలతో కలిసి స్నానానికి దిగాడు. వారంతా ఈత కొడుతూ చెరువు మధ్యలోకి వెళ్లారు. మోహనరావు బురదలో ఇరుక్కుపోవడంతో మునిగిపోయాడు. బయటకు వచ్చిన స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. సమాచారం అందుకున్న సోంపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
Updated Date - 2021-06-16T05:16:40+05:30 IST