ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసురుతీసిన ఈత సరదా

ABN, First Publish Date - 2021-06-16T05:16:40+05:30

ఈత సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. ఈ విషాద ఘటన మఖరాంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొగిడియాపుట్టుగకు చెందిన బొగియా మోహనరావు(29) మంగళవారం మఖరాంపురం పాఠశాల ఆవరణలోని క్రీడామైదానంలో తోటి స్నేహితులతో క్రికెట్‌ ఆడాడు. ఇంటికి తిరుగుముఖం పడుతున్న సమయంలో సమీపంలోని లింగాల చెరువులో స్నేహితులు రాంబాబు,

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



చెరువులో స్నానానికి దిగి యువకుడి మృతి

మఖరాంపురంలో ఘటన

కంచిలి: ఈత సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. ఈ విషాద ఘటన మఖరాంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొగిడియాపుట్టుగకు చెందిన బొగియా మోహనరావు(29) మంగళవారం మఖరాంపురం  పాఠశాల ఆవరణలోని క్రీడామైదానంలో తోటి స్నేహితులతో క్రికెట్‌ ఆడాడు. ఇంటికి తిరుగుముఖం పడుతున్న సమయంలో సమీపంలోని లింగాల చెరువులో స్నేహితులు రాంబాబు, హరికృష్ణలతో కలిసి స్నానానికి దిగాడు.  వారంతా ఈత కొడుతూ చెరువు మధ్యలోకి వెళ్లారు. మోహనరావు బురదలో ఇరుక్కుపోవడంతో మునిగిపోయాడు. బయటకు వచ్చిన స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెతుకులాట ప్రారంభించారు.  సమాచారం అందుకున్న సోంపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. 





Updated Date - 2021-06-16T05:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising