ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక లారీ ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-04-17T05:57:14+05:30

రాజాం-చీపురుపల్లి రోడ్డులో గాయత్రికాలనీ వద్ద శుక్రవారం ఇసుక లారీ ఢీకొని యువకుడు కోరాడ శ్రీను (25) దుర్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌ : రాజాం-చీపురుపల్లి రోడ్డులో గాయత్రికాలనీ వద్ద శుక్రవారం ఇసుక లారీ ఢీకొని యువకుడు కోరాడ శ్రీను (25) దుర్మరణం చెందాడు. రాజాం ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం గులువిందల అగ్రహారం వీధికి చెందిన కోరాడ శ్రీను తన స్నేహితుడు చింతపల్లి రాజుతో కలిసి ద్విచక్రవాహనంపై రాజాం వచ్చాడు. ఇక్కడ బ్యాంకు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం వెనుకన కూర్చొన్న రాజు తుళ్లిపోగా, వాహనాన్ని నడుపుతున్న శ్రీను లారీ చక్రాల కిండపడి నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రాజును తొలుత రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-17T05:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising