ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-11-21T05:57:03+05:30

తొలుసూరుపల్లి రోడ్డులో భవన నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికుడు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

అప్పయ్య(ఫైల్‌):
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 టెక్కలి రూరల్‌, నవంబరు 20: తొలుసూరుపల్లి రోడ్డులో భవన నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికుడు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  టెక్కలి మండలం కె కొత్తూ రుకు చెందిన కోనారి అప్పయ్య, రాములమ్మ భార్యాభర్తలు. పట్టణంలోని తొలుసూరుపల్లి రోడ్డులో ఓ భవన నిర్మాణ పనికి శనివారం వచ్చారు. అయితే అప్పయ్య (61) రెండో అంతస్తుకు పనికి వెళ్తున్న సమయంలో సమీపంలోని విద్యుత్‌ తీగలు తగిలి అక్కడి నుంచి కింద పడిపోయాడు. ఈ సంఘటనను భార్యతో పాటు ఇతర కార్మికులు గమనించి అతడిని చూసేసరికి అప్పటికే మృతిచెందడంతో బోరున విలపించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

  


Updated Date - 2021-11-21T05:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising