వలంటీరు వ్యవస్థను బలోపేతం చేస్తాం
ABN, First Publish Date - 2021-06-19T05:18:23+05:30
వలంటీరు వ్యవస్థను బలోపేతం చేస్తాం
- ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
రాజాం రూరల్ : వలంటీరు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని తిరిగి వస్తూ రాజాంలో పారిశ్రామికవేత్త ఇనుగంటి జనార్దనరావు స్వగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. ఈ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవదూరమన్నారు. సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందించే ఈ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. భూసర్వేతో రైతాంగానికి ఎంతో మేలు కలగనుందన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలవలస విక్రాంత్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-06-19T05:18:23+05:30 IST