ఇండోర్ స్టేడియం పూర్తిచేస్తాం: మంత్రి
ABN, First Publish Date - 2021-08-02T04:45:26+05:30
పలాస ఉన్నత పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆదివారం పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో ఓపెన్ జిమ్ ప్రారంభించారు.
పలాస: పలాస ఉన్నత పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆదివారం పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో ఓపెన్ జిమ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, కమిషనర్ టి.రాజేంద్ర ప్రసాద్, వైస్చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్బాబు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులు
కాశీబుగ్గ: ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేటీరోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి అప్పలరాజు ఆదేశించారు. ఆదివారం పలాస ఉన్నత పాఠశాల మైదానం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు రోడ్డు పనులను పరిశీలించారు. కేటీరోడ్డు పనుల్లో సమస్యలపై కొందరు వ్యాపారులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
Updated Date - 2021-08-02T04:45:26+05:30 IST