మానవత్వం చాటుకున్న వీఆర్వో
ABN, First Publish Date - 2021-04-14T05:29:34+05:30
: అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేపట్టి వీఆర్వో మానవత్వాన్ని చాటుకున్నాడు.
నందిగాం, ఏప్రిల్ 13: అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేపట్టి వీఆర్వో మానవత్వాన్ని చాటుకున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 67 ఏళ్ల వయసున్న వ్యక్తి అనారోగ్యంతో శ్రీకాకుళంలో సోమవారం రాత్రి గ్రామానికి తీసుకువచ్చారు. అయితే మృతుడికి కొవిడ్ అనుమానంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ విషయం వీఆర్వో యుగంధర్ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులకు అవగాహన కలిగించి తాను దగ్గర ఉండి మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు.
Updated Date - 2021-04-14T05:29:34+05:30 IST