అప్పుల బాధ భరించలేక ఒకరి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-01-27T05:15:22+05:30
అప్పుల బాధ భరించలేక నగిరికటకం గ్రామానికి చెందిన కాసిన సోమేశ్వరరావు (30) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
జలుమూరు, జనవరి26: అప్పుల బాధ భరించలేక నగిరికటకం గ్రామానికి చెందిన కాసిన సోమేశ్వరరావు (30) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. . సోమేశ్వరరావు గత కొన్నాళ్లుగా ఆమదాలవలసలో జీవనం సాగిస్తూ నెల రోజుల కిందటే కుటుంబంతో సహా నగిరికటకం వచ్చాడు. వ్యసనాలకు బానిసైన ఆయన కుటుంబాన్ని పోషించలేక, అప్పులు బాధ భరించలేక ఈ నెల 24న మద్యంలో పురుగు మందు కలిపి తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమేశ్వర్కు తల్లి నీలవేణి, భార్య లక్ష్మి, కుమారుడు గుణశేఖర్ (5) ఉన్నారు. తమ్ముడు కాసిన సుందరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు.
Updated Date - 2021-01-27T05:15:22+05:30 IST