9న ‘సేవ్ ఇండియా’ ఆందోళనను జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2021-08-02T04:43:31+05:30
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలిచ్చి ప్రజలపై పెనుభారం మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా ‘సేవ్ ఇండియా’ నినాదంతో చేపడుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తి నాయుడు కోరారు. ఆదివారం ప్రజా సంఘాల సదస్సు నిర్వహించారు.
రాజాం, ఆగస్టు 1: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలిచ్చి ప్రజలపై పెనుభారం మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా ‘సేవ్ ఇండియా’ నినాదంతో చేపడుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తి నాయుడు కోరారు. ఆదివారం ప్రజా సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. సమావేశంలో అనిల్కుమార్, సత్యారావు, శాంతి, సురేష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-02T04:43:31+05:30 IST