పండుగ పూట విషాదం
ABN, First Publish Date - 2021-01-16T05:38:47+05:30
సంక్రాంతి రోజున రోడ్డు ప్రమాదం ఓ కుటుం బంలో విషాదం నింపింది. అత్తవారింట్లో ప్రత్యేకపూజకోసం దంపతులు వెళ్లారు. తిరిగివస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది
ఫరోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం, భార్యకు గాయాలు
ఫఅత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఘటన
పొందూరు:సంక్రాంతి రోజున రోడ్డు ప్రమాదం ఓ కుటుం బంలో విషాదం నింపింది. అత్తవారింట్లో ప్రత్యేకపూజకోసం దంపతులు వెళ్లారు. తిరిగివస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయప డిన భర్త కొద్దిసేపటికే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని లైదాం గ్రామానికి చెందిన లుట్ట వెంకటరమణ (47) భార్య ఆదిలక్ష్మితో కలిసి బాణాంలో అత్తవారి ఇంట్లో జరిగే పేరంటాలు ఉత్సవానికి ద్విచక్రవా హనంపై వెళ్లివస్తున్నారు.బాపిరాజుపేట గ్రామసమీపంలో మలుపువద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో వెంకటరమణ తలకు తీవ్రగాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. భార్య ఆదిలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. ఈ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వెంకటరమణను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. గాయపడిన ఆదిలక్ష్మికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణా ప్రాయం తప్పింది. పోలీసులు వెంకటరమణ మృతదేహాన్ని శీక్రాకుళం రిమ్స్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ దేవానంద్ కేను నమోదు చేశారు. కాగా అదపాకకు చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై అతివేగంతో ద్విచక్రవాహనం నడుపుతూ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు. చిన్నచిన్న గాయాలు తగిలిన యువకుడు అక్కడే ఉండి మిగి లిన ఇద్దరు పరారైనట్లు పేర్కొంటున్నారు. కాగాబాపిరాజుపేట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో లైదాంకు చెందిన వెంకటరమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - 2021-01-16T05:38:47+05:30 IST