నేడు పీసీఎంఏ సర్వసభ్య సమావేశం
ABN, First Publish Date - 2021-01-22T05:22:12+05:30
పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ (పీసీఎంఏ) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 28వ తేదీకి ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక పీసీఎంఏ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు.
పలాస: పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ (పీసీఎంఏ) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 28వ తేదీకి ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక పీసీఎంఏ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. జనరల్ బాడీ సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ను కోర్కమిటీ విడుదల చేయనుంది. 160 మంది సభ్యులున్న పీసీఎంఏ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
Updated Date - 2021-01-22T05:22:12+05:30 IST