ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశధార కాలువలో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-10-22T05:24:18+05:30

మండలం కరకవలస కాలనీ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువలో పడి నిమ్మడాల వెంకటేష్‌ (25) మృతి చెందాడు.

వెంకటేష్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జలుమూరు, అక్టోబరు 21: మండలం కరకవలస కాలనీ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువలో పడి నిమ్మడాల వెంకటేష్‌ (25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. విశాఖ జిల్లా యలమంచిలి మండలం చిన్నచేకులపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్‌ కరకవలస కాలనీలో స్నేహితుని వివాహానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం వంశధార కాలువలో స్నానానికి వెళ్లాడు. స్నానానికి వంశధార కాలువలోకి దిగి కొట్టుకుపోవడంతో మిగతా స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.  వెంకటేష్‌ గురువారం ఉదయం కాలనీకి 100 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. మృతుడు విశాఖలో పైజర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మృతుడి అన్నయ్య నిమ్మడాల శివ గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  మృతుడికి తల్లి, అన్నయ్య  ఉన్నారు.


Updated Date - 2021-10-22T05:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising