సముద్రంలో తెప్ప బోల్తా
ABN, First Publish Date - 2021-01-27T05:17:09+05:30
సముద్రంలో తెప్ప బోల్తా
మత్స్యకార యువకుడి మృతి ఫ మరో ఇద్దరు క్షేమం
రణస్థలం,జనవరి 26: సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఓ మత్స్యకార యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వివరా ల్లోకి వెళ్తే... జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన బర్రి అజయ్ (18), అతని తండ్రి అమ్మోరు, మరోవ్యక్తి రాములు కలసి మంగళవారం ఉదయం ఫైర్ తెప్పపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకొని తీరానికి వస్తుండగా అలల ఉధృతికి తెప్పబోల్తా పడింది. అజయ్ గల్లంతవగా అమ్మోరు, రాములు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గ్రామస్థులకు విషయం చెప్ప డంతో వారంతా సముద్రంలో వెతకడం ప్రారంభించారు. సాయంత్రానికి అజయ్ మృతదేహం తీరంలో లభ్యంకావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జేఆర్పురం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Updated Date - 2021-01-27T05:17:09+05:30 IST