మెగా వైద్యశిబిరం విజయవంతం
ABN, First Publish Date - 2021-03-08T05:22:11+05:30
సుసరాం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది.
సుసరాం (పోలాకి): సుసరాం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. ఈ శిబిరాన్ని వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ధర్మాన పద్మప్రియ ప్రారంభించారు. మెడికవర్ హాస్పిట ల్స్ వైద్య బృందంతో పాటు ప్రముఖవైద్యులు 20 మంది శిబిరానికి హాజరై 1600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దుంపల ఆనందరావు, కరిమిరాజేశ్వరరావు, కణితి కృష్ణ, కణితి సత్తిబాబు, మజ్జి రమణమ్మ, నరసన్నపేట కమ్యూనిటీ వైద్యశాల సూపరెండెంట్ సూరపుకృష్ణ, తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-03-08T05:22:11+05:30 IST