ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-04-11T05:15:14+05:30

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో టీజీవీఎస్‌ కుమార్‌ హెచ్చరించారు.

రాజాం : మాట్లాడుతున్న ఆర్డీవో కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ ఆర్డీవో కుమార్‌

రాజాం : కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో టీజీవీఎస్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం పట్టణ పరిధిలోని దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణదారులు, షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది విధిగా మాస్క్‌లు ధరించడంతో పాటు శానిటైజర్‌ వినియోగించాలన్నారు. కొనుగోలు కూడా నిబంధనలు పాటించేలా అవగాహన కలిగించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. షాపులను నిరంతరం పర్యవేక్షించాలని తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. మాస్క్‌లు  ధరించని వారికి రూ.250 జరిమానా విధించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising