ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆమదాలవలస’లో వార్డుల విభజనపై స్టే!

ABN, First Publish Date - 2021-06-15T05:23:30+05:30

ఆమదాలవలస మునిసిపాల్టీలో వార్డుల విభజన పై హైకోర్టు స్టే విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



(ఆమదాలవలస)

ఆమదాలవలస మునిసిపాల్టీలో వార్డుల విభజన పై హైకోర్టు స్టే విధించింది. గతంలో 23 వార్డులుండగా... బీ గ్రేడ్‌ మునిసిపాల్టీగా మారడంతో 27 వార్డులుగా అధికా రులు విభజించారు. ఇందుకు సంబంధించి 2020 జనవరి గజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశా రు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నాయకుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోర గోవిందరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగానే జిల్లాలో మిగతా మునిసిపాల్టీలకు ఎన్నికలు జరిగినా...ఆమదాలవలస పురపాలక సంఘానికి నిర్వహించలేదు. కోర్టు సూచనల మేరకు ఈ ఏడాది మార్చిలో మరోసారి వార్డుల విభజనకు శ్రీకారంచుట్టారు. ఏప్రిల్‌లో గజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచే శారు. అయితే  కృష్ణాపురం, చింతాడ గ్రామాలకు సంబంధించి విభజన ప్రక్రియ సరిగా లేదని టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ అధికారులు సవరణ చేపట్టకపోవడంతో బోర గోవిందరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించినట్టు గోవిం దరావు సోమవారం విలేఖర్లకు తెలిపారు.ఈ విషయంపై మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.రవి సుధాకర్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని తెలిపారు. 

Updated Date - 2021-06-15T05:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising