గత ప్రభుత్వాలతో రాష్ట్రం అప్పుల పాలు
ABN, First Publish Date - 2021-10-18T05:33:09+05:30
గతంలో పాలించిన ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించాయని, లోటు బడ్జెట్తో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అయినప్పటికీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్కు దక్కిందని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగో పాలరావు పేర్కొన్నారు.
- జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
- కోరుకొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
కోరుకొండ, అక్టోబరు 17: గతంలో పాలించిన ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించాయని, లోటు బడ్జెట్తో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అయినప్పటికీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్కు దక్కిందని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగో పాలరావు పేర్కొన్నారు. మండలంలోని దోసకాయలపల్లిలో జడ్పీటీసీ కర్రి నాగే శ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జక్కం పూడి రాజాతో కలిసి ఆయన మాట్లాడారు. నాలుగైదు రోజుల నుంచి విద్యుత్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సీఎం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. గ్రామా ల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, బల్క్మిల్క్ సెంటర్ల నిర్మాణం 95 శాతం పూర్తయిందన్నారు. రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని జడ్పీ చైర్మన్ అన్నారు.
Updated Date - 2021-10-18T05:33:09+05:30 IST