శ్రీకాకుళంలో నేటి నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోత
ABN, First Publish Date - 2021-10-12T14:34:12+05:30
విద్యుత్ సంక్షోభంలో భాగంగా నేటి నుంచి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధించనున్నారు.
శ్రీకాకుళం: విద్యుత్ సంక్షోభంలో భాగంగా నేటి నుంచి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు జిల్లా యంత్రాంగం నేటి నుంచి అమలు చేయనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ప్రకటించారు. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు విద్యుత్ శాఖ అధికారులు మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.
Updated Date - 2021-10-12T14:34:12+05:30 IST